Notice: Test mode is enabled. While in test mode no live donations are processed.

$
Select Payment Method
Personal Info

Donation Total: $100.00

Education

Free Book’s Distribution

చైతన్య స్వచ్చంద సేవా సంస్థ నందు పుస్తక వితరణ

అన్నమయ్య జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని పిల్లలకు నూతన సంవత్సర కానుకగా కావలసిన పుస్తక సామాగ్రిని మదనపల్లె టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మురళీకృష్ణ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చంద్రమోహన్ చేతుల మీదుగా మన చిన్నారులకు పుస్తక వితరణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ మీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమి పట్టించుకోకుండా కేవలం చదువు పైన మాత్రమే దృష్టి సారిస్తూ ముందుచూపుతో.. ఒకే ఒక లక్ష్యంతో ముందుకు సాగిపోతే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కావున మీరందరూ ఎటువంటి సమస్య వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా మానసికంగా దృఢంగా స్థిరంగా కేవలం విద్య పైన దృష్టి సారించాలని భవిష్యత్తులో మన సమాజానికి మంచి పౌరులుగా మీరు సేవలు అందివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చంద్రమోహన్ వి ఎస్ ఆర్ గ్రూప్స్ అధినేత వీఎస్ఐ గ్రాండ్ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి గారు మరియు పోలీస్ సిబ్బందితో కలిసి వివేకానంద ఆశయం ఫౌండేషన్ భాను ప్రకాష్ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఆనందన్ మాట్లాడుతూ మాకు ఎటువంటి స్థిరమైన ఫండింగ్ లేకపోయినా మీలాంటి దాతల సహాయ సహకారాలతో ముందుకు నడుపుతున్నామని, ఈ నూతన సంవత్సరం పోలీస్ శాఖ నుంచి ఈ పుస్తక వితరణ మాకు చాలా శుభప్రదంగా ఉందని, మాకు సహాయం చేస్తున్న విధాత ల్లాంటి దాతలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేకించి సంస్థ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములుతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సంస్థ పాలనాధికారి డాక్టర్ జి సుబ్రహ్మణ్యం బాబు గారు సంస్థ జనరల్ సెక్రెటరీ ఏ కవితా రాణి,మరియు ముత్తు ఆంగ్ల మాద్యం పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల బృందం సుభాషిని,పుష్పవతి,రెడ్డి లక్ష్మి, పల్లవి, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Comment

Your Comment
All comments are held for moderation.